న్యూఢిల్లీ: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) కామెంటరీ ప్యానల్ నుంచి ఉద్వాసనకు గురైన సంజయ్ మంజ్రేకర్కు మాజీ క్రికెటర్ చంద్రకాంత్ పండిట్ బాసటగా నిలిచాడు. అతన్ని తిరిగి కామెంటరీ ప్యానల్లోకి తీసుకోవాలని బీసీసీఐని అభ్యర్థించాడు. స్వతహాగా తన వ్యాఖ్యానంలో దూకుడు స్వభావం ఉన్న మంజ్రేకర్.. ఎవర్నీ కావాలని గాయపరచడంటూ వెనుకేసుకొచ్చాడు. తనకు మంజ్రేకర్ చిన్నతనం నుంచి తెలుసని, అతనిది ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావమే తప్పితే వేరే ఉద్దేశాలు ఏమీ ఉండన్నాడు. ఒక కామెంటరీ చెప్పేటప్పుడు ప్రతీసారి ప్రజల్ని ఆకట్టుకునే వ్యాఖ్యానాలు అతను చేయలేకపోవచ్చని, అందుచేత మంజ్రేకర్ను తన కామెంటరీ ప్రొఫెషన్కు దూరం చేయడం భావ్యం కాదన్నాడు. మంజ్రేకర్ను కాస్త దూకుడు తగ్గించమని బీసీసీఐ ఒక వార్నింగ్ ఇచ్చి, మళ్లీ అతన్ని విధుల్లోకి తీసుకోవాలన్ని చంద్రకాంత్ పండిట్ కోరాడు. (ఇక నీ వ్యాఖ్యానం అవసరం లేదు: సీఎస్కే)
‘కామెంటరీ ప్రొఫెషన్కు దూరం చేయొద్దు’